కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దు అయ్యి రోజు వారీ ఆదాయం తో బ్రతికే పేద సినీ కార్మికుల జీవనం కష్టాలపాలయింది. సినీపరిశ్రమ పై ఆధారపడిన పేద సినీ కార్మికుల సంక్షేమానికై చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ సంస్థ ప్రారంభమయింది. సుమారు 12000 వేల మంది కార్మికులకు ఈ సంస్థ నిత్యావసర వస్తువులు అందజేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినీ ప్రముఖులు తమ వంతు సాయం గా కరోనా క్రైసిస్ ఛారిటీ కి విరాళాలు అందించారు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ఈ రోజు CCC కి 2లక్షలు విరాళం అందజేశారు. కాజల్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, హాలీవుడ్ క్రాస్ ఓవర్ “మోసగాళ్ళు”మూవీలో కాజల్ నటిస్తున్నారు. పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: