ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇలానే ఉండాలన్న ఈక్యేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసి కొత్త కొత్త పంథాలను ఏర్పరుచుకొని ముందుకు దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే డైరెక్టర్ లు కూడా నిర్మాతలుగా మరి ఆర్ధికంగా బలపడుతున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఇక వీరిలాగే స్టార్ డైరెక్టర్ కొరటాల కూడా నిర్మాతగా మారనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం లాక్ డౌన్ ముగిసిన వెంటనే కొరటాల నిర్మతగా తన సినిమాని ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోన్న ఓ నూతన దర్శకుడికి, కొరటాల దర్శకత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో కలిపి పెద్ద సినిమాలు తీయాలన్న ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చిన్న బడ్జెట్ చిత్రంతో కొరటాల నిర్మాతగా మారనున్నట్టు తెలుస్తుంది. పైగా శివనే స్వయంగా ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
కాగా ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: