“అందాల రాక్షసి” లావణ్య త్రిపాఠి కరోనా రక్కసి నుండి రక్షణ కై ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించాలని పిలుపునిచ్చారు. షూటింగ్స్ రద్దు అయిన కారణంగా పేద సినీ కార్మికుల కష్టాలకు స్పందించి కరోనా క్రైసిస్ ఛారిటీ కి విరాళమందించిన మొదటి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు కరోనా వ్యాప్తి నివారణ కై మాస్క్ లు తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందజేసే కార్యక్రమం ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి నివారరణ కై ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలనే ప్రభుత్వ ప్రకటనకు లావణ్య స్పందించారు. మాస్క్ ల తయారీ పై లావణ్య మాట్లాడుతూ .. డిజైనర్ అనితారెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమె తన స్టాఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని తెలుపడంతో , వారి సేవలను ఉపయోగించుకుని హోమ్ మేడ్ మాస్క్ లు తయారు చేసి, ఉచితంగా సప్లై చేయాలనే ఆలోచనతో నాన్ ప్రాఫిట్ వెంచర్ ప్రారంభించామని లావణ్య తెలిపారు. లావణ్య ప్రస్తుతం” A1 ఎక్స్ ప్రెస్” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: