‘భీష్మ’తో ‘మహానటి’?

Mahanati Fame Keerthy Suresh and Nithiin Pair Up Again For Another New Movie

`భీష్మ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత యువ క‌థానాయ‌కుడు నితిన్ నుంచి రాబోతున్న‌ చిత్రం `రంగ్ దే`. ఇందులో నితిన్‌కు జోడీగా ‘మ‌హాన‌టి’ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే.. నితిన్ స‌ర‌స‌న‌ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో నాయిక‌గా న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంద‌ట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `ఛ‌ల్ మోహ‌న రంగ‌` త‌రువాత నితిన్, ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య కాంబినేష‌న్‌లో ‘ప‌వ‌ర్ పేట’ పేరుతో మ‌రో చిత్రం రాబోతోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని తెలిసింది. గోదావ‌రి జిల్లాల నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో.. గోదావ‌రి యాస‌లో మాట్లాడే ఏలూరు అమ్మాయిగా కీర్తి క‌నిపించ‌నుండ‌గా, గోదావ‌రి యాస మాట్లాడే అబ్బాయిగా నితిన్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =