శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఫిదా ” మూవీ ఘనవిజయం సాధించింది. సాయి పల్లవి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయ చిత్రం “ఫిదా” లో తెలంగాణ యువతి భానుమతి గా సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సాయి పల్లవి “ఫిదా” మూవీ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఫిదా” మూవీ లో సాయి పల్లవి ట్రాక్టర్ నడిపే సీన్ ఉన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఆ సీన్ గురించి మాట్లాడుతూ ..ట్రాక్టర్ ను మాములు రోడ్డు లో నడపటం వేరు, బురద నీటిలో నడపటం వేరని, ట్రాక్టర్ నడుపుతూ సహజ హావభావాలతో నటించడానికి చాలా కష్ట పడ్డానని, తన సినీ కెరీర్ లో అత్యంత కష్టమైన సన్నివేశం అదని చెప్పారు. సాయి పల్లవి ప్రస్తుతం రానా హీరోగా రూపొందుతున్న “విరాటపర్వం”, నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీస్ లో నటిస్తున్నట్టు చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: