ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఏం సినిమా చేస్తాడా అన్నది మాత్రం గత కొద్దిరోజులుగా కన్ఫ్యూజన్ గా ఉంది. అయితే ముందు వంశీ పైడి పల్లి తోనే ఉంటుంది అన్నారు. కానీ వీరిద్దరి సినిమా ఇప్పట్లో లేదు. ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మహేష్ తర్వాత సినిమా పరుశురాం తో కానీ… వెంకీ కుడుముల తో కానీ ఉంటుంది. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. అంతేకాదు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సందీప్ వంగా తో కూడా మహేష్ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే… ఈ సినిమాను మహేష్ బాబు కెరీర్ ను ఒక మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి ని రిలీజ్ చేసిన డేట్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అంటే ఈ ఏప్రిల్ కాదులేండి వచ్చే ఏడాది 28న అన్నమాట. మరి మహేష్ 27వ సినిమా అవ్వాలి… అది అయ్యి ఈ సినిమా అవ్వాలి..అప్పటికి ఎన్ని ఈక్వేషన్స్ మారతాయో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: