మ‌రోసారి ర‌వితేజ‌కి జోడీగా త్రిష‌?

Mass Maharaja Once Again Teams Up With Trisha After Krishna

ప‌న్నెండేళ్ళ క్రితం సంక్రాంతికి విడుద‌లై విజ‌యం సాధించిన చిత్రం `కృష్ణ‌` (2008). మాస్ మ‌హారాజా ర‌వితేజ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ బ్యూటీ త్రిష నాయిక‌గా న‌టించింది. ఆ సినిమా త‌రువాత ఈ జోడీ మ‌ళ్ళీ సంద‌డి చేయ‌నేలేదు. క‌ట్ చేస్తే.. పుష్క‌ర‌కాలం త‌రువాత ర‌వితేజ, త్రిష క‌ల‌సి న‌టించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `వీర‌`(2011) త‌రువాత ర‌వితేజ, ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్ న‌టించ‌నుంది. కాగా, మెయిన్ లీడ్ గా త్రిష ఎంపికైంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే త్రిష ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. `కృష్ణ‌` త‌రువాత ర‌వితేజ‌, త్రిష కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా స‌క్సెస్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + three =