ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ అనారోగ్యంతో ఈరోజు(మర్చి 21) తెల్లవారుజూమున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కాగా, తన తల్లి మరణంతో రత్నవేలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రత్నవేలుకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రత్నవేలు భావోద్వేగభరితంగా స్పందించారు.”నా కళ్లలోకి చూసి నా ఆశయాలను, ఆకాంక్షలను గ్రహించగల వ్యక్తి మా అమ్మ. ఎప్పుడూ నా వెన్నంటే నిలిచింది. జీవితంలో ఏమేం సాధించాలని అనుకున్నానో అన్నింటినీ సాకారం అయ్యేలా చేసిన అమృతమూర్తి మా అమ్మ. ఇవాళ నేనీ స్థితిలో ఉన్నానంటే అందుకు మా అమ్మే కారణం. నా స్ఫూర్తి, నా శక్తి, నా సంతోషం అన్నీ ఆమే. అమ్మా, నిన్నెంతో మిస్సవుతున్నాను. జీవితకాలం నీకు రుణపడివుంటాను” అంటూ ట్వీట్ చేశారు.
MY Mother
One who understood my dream&passion without words by just looking at eyes
She stood by me
Supported me&made sure,I succeed&achieve wht ever I wish in Life!
wht I’m today is because of her!
My inspiration
My almighty
My happiness
Amma” I miss you” gratitude4evrLUV pic.twitter.com/K0oBxnHMl2— Rathnavelu ISC (@RathnaveluDop) March 21, 2020
కాగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రంగస్థలం’, ‘సైరా’, ఖైదీ నెం150, రంగస్థలం, రోబో వంటి సూపర్హిట్ సినిమాలకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన శంకర్-కమల్ కాంబోలో వస్తోన్న ‘ఇండియన్-2’ చిత్రానికి పనిచేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్లో రత్నవేలు టాప్ కెమెరామెన్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: