కరోనాకు భయపడి ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ లు కూడా ఆపేసారు. సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపాటికి తాను షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంత డేరింగ్ ఉన్న డైరెక్టర్ ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఎవరో కాదు మన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. షూటింగ్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. షూటింగ్ ప్రస్తుతం మహబూబ్నగర్లో జరుగుతుంది. అక్కడే నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నాడు కమ్ముల. కరోనాని సైతం డోంట్ కేర్ అంటూ.. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే షూటింగ్ చేస్తున్నామని చెప్పాడు ఈయన. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సాయి పల్లవి, చైతూతో పాటు మరికొందరు కీలక నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో ఉన్నారు. మొతానికి ఎలాగైనా సమ్మర్లో ఈ ఈసినిమాను రిలీజ్ చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు శేఖర్ కమ్ముల.
ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏ పిల్లా సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది.
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. అంతేకాదు ఫిదాలో సాయి పల్లవితో మ్యాజిక్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి నాగ చైతన్య-సాయి పల్లవిల ‘ లవ్ స్టోరీ’ ఎలా ఉంటుందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: