చిరు-కొరటాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు ఒక నిర్మాతగా రామ్ చరణ్ కూడా ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చరణ్ పై గతరెండు రోజులుగా ఒక వార్త నెట్టింట హల్ చల్ చేసింది. అదేంటంటే… ఆయన ఈ చిత్రం ప్రొడక్షన్ కు సింగిల్ పైసా కూడా ఖర్చుపెట్టడంలేదని.. మరో నిర్మాత నిరంజన్ రెడ్డి మాత్రమే చూసుకుంటున్నాడని… అంతేకాక తను ఆచార్య లో చేస్తున్నందుకు రెమ్యునేషన్ తీసుకోవటమే కాకుండా, నిర్మాతగా సగం వాటా సైతం తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలపై స్పందించిన నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రామ్ చరణ్ పై వచ్చిన వార్తల్లో నిజం లేదు… రామ్ చరణ్ ప్రతి ఒక్క విషయంలో.. డిస్కషన్స్ లో తప్పకుండా వుంటారు… అన్నీ పనుల్లో సమానమైన షేరింగ్ ఉంటుందని.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా క్లారిటీ ఇస్తూ అధికారికంగా ఒక లేఖ ద్వారా ప్రకటించించారు. మరి ఇప్పటికైనా కొంతమంది డౌట్స్ క్లియర్ అయితాయేమో చూద్దాం..
A press release from our Producer Niranjan Reddy garu. #Chiru152 pic.twitter.com/BG7wxIqY7G
— MatineeEntertainment (@MatineeEnt) March 21, 2020
మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొణిదల ప్రొడక్షన్స్ తో కలిసి రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: