విలక్షణ నటుడు మోహన్ బాబు 1992 సంవత్సరంలో తిరుపతి లో శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు బర్త్ డే రోజు మార్చి 19వ తేదీ ప్రతీ సంవత్సరం విద్యా సంస్థల వార్షికోత్సవం జరుగుతుంది. 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది. 40వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు విద్య ను అందిస్తున్న విద్యా సంస్థల వార్షికోత్సవం కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా వైరస్ కారణంగా ప్రజా జీవితం అతలాకుతలం అయ్యిందని, ప్రజలు గుంపులు, గుంపులు గా ఉన్నప్పుడు ఒకరినుండి మరొకరికి ఈ వ్యాధి సోకే ప్రమాదముందని , మార్చి 19 వ తేదీ జరగవలసిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వార్షికోత్సవం , తన బర్త్ డే వేడుకలను వాయిదా వేయడం జరిగిందని , తన మిత్రులు, శ్రేయోభిలాషులు , అభిమానులు అభినందనలు తెలియజేయడానికి రావొద్దని,కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: