టాలీవుడ్ లో స్టార్ ప్లస్ లక్కీ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సమంత. ఏం మాయ చేసావే సినిమాతో అరంగేట్రం చేసిన సమంత ఆ తర్వాత వెనక్కి తిరిగిచుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో చేసి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత వరుసగా హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే పెళ్ళైన తర్వాత సమంత తన రూట్ ను మార్చేసింది. కేవలం పాత్ర ప్రధానమైన… లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తుంది. ‘యు టర్న్’, ‘ఓ బేబీ’ చిత్రాలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ని ఒంటి చేత్తో నడిపించగలిగే సత్తా సమంతకు ఉందని ప్రూవ్ చేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి సమంత సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితోపాటు తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే. మాయ, గేమ్ ఓవర్ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేమ్) సరసన నటించబోతోంది. మరి ప్రశాంత్ సినీ పరిశ్రమకు దూరమై చాలా కాలం అయింది. మళ్ళీ వినయ విధేయ రామ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పెద్దగా సినిమాలు రాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో సమంత ఈ నిర్ణయం తీసుకుందంటే ఆశ్చర్యకరమైన విషయమే. మరి చూద్దాం ఈ సినిమాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: