మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదే ఉన్నాడు. అలా షూటింగ్ ను మొదలు పెట్టాడో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 24 న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. సుమారు రెండు వారాలు జరిగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్, ఇంకొందరు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడి షెడ్యూల్ పూర్తవడంతో వరుణ్ తేజ్ హైదరాబాద్ చేరుకున్నారు. సెకండ్ షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు వెంకటేష్ బాబీ ఈ మూవీ తో నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
మరి ఎఫ్2, గద్దల కొండ గణేష్ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమాతో వరుణ్ హ్యాట్రిక్ కొడతాడేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: