నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు కేవలం వార్తల్లోనే నిలిచిన ఈ సినిమా ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సినిమాను తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ చిత్రం చిత్రకరణ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం .. ఈ యుగంలో దానిని తెలుసుకోవడానికి సాగించే అన్వేషణగా ఈ కథ నడవనుందని తెలుస్తోంది. స్వార్థానికి ఒకరు .. సాధించడానికి ఒకరు .. మంచి సంకల్పానికి సాయం చేసిన దెవరు? అంటూ సాగిన ఈ వీడియో టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
And it begins 😎#Karthikeya2 Movie formally launched today in Tirumala!
చైత్రం లో చిత్రీకరణ మొదలు.
👉https://t.co/UO0ynO2osl@actor_Nikhil @chandoomondeti @kaalabhairava7 @AbhishekOfficl @vivekkuchibotla @peoplemediafcy @sahisuresh @AAArtsOfficial #TGVishwaprasad pic.twitter.com/CusYxt2gTI
— People Media Factory (@peoplemediafcy) March 2, 2020
కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి చూద్దాం కార్తికేయ సీక్వెల్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: