బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ తో షూటింగును మొదలెట్టారు. తొలి షెడ్యూల్లోనే యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. గ్రహాలు .. ప్రభావం ఒక కోణంగా, అఘోర పాత్ర మరో కోణంగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో శ్రియ – అంజలి కథానాయికలుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మరి సింహా, లెజెండ్స్ వంటి హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చూద్దాం మరి హ్యాట్రిక్ కొడతారో?లేదో?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: