రమేశ్ కడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వలయం’. సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో భార్య కనపడకుండా పోతుంది.ఆమెకు ఉన్న లవ్ ఎఫైర్ కారణంగా హీరోనే చేంపేశాడని పోలీసులు అనుమానిస్తుంటారు. ఉన్న ఆధారాల ఆధారంగా హీరో ఆమెను ఎలా కనుగొన్నాడనేదే కథాంశం అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అసలు సీక్రెట్ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ అందించారు.
[custom_ad]
కాగా ఈ సినిమాలో ఇంకా రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటించనున్నారు. బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగుప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: