`ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయం అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి.. స్వల్ప విరామం తరువాత తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. `మహాసముద్రం` పేరుతో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఒక కథానాయకుడిగా శర్వానంద్ నటించనుండగా… మరో కథానాయకుడి కోసం అన్వేషణ సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఇంతకుముందు ఈ సినిమాలో సమంత నాయికగా నటించే అవకాశముందని ప్రచారం సాగింది. తాజా సమాచారం ప్రకారం.. ఆ పాత్రలో `సమ్మోహనం` నాయిక అదితి రావ్ హైదరీ నటిస్తోందని తెలిసింది. త్వరలోనే అదితి ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
[custom_ad]
ఏప్రిల్ నుంచి పట్టాలెక్కనున్న `మహాసముద్రం` సంవత్సరాంతంలో థియేటర్లలో సందడి చేయనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాకి `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ బాణీలు అందించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: