మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయ్యింది. ఒక పాట, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, రెండో షెడ్యూల్ ని ఈ నెల 24 నుంచి చిత్రీకరించనున్నారని సమాచారం. రాజమండ్రిలో సాగే ఈ షెడ్యూల్ లో నాయిక త్రిష కూడా జాయిన్ అవుతుందట. అక్కడ కొన్ని పోరాట ఘట్టాలతో పాటు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారని తెలిసింది. కాగా, ఆగస్టులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: