`ఛలో`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రష్మికా మందన్న. మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసిన ఈ కన్నడ కోమలి… ఆపై `గీత గోవిందం`తో స్టార్డమ్ పొందింది. ఇటీవలే `సరిలేరు నీకెవ్వరు` రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక… త్వరలో `భీష్మ`తో పలకరించబోతోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రంలోనూ తనే నాయిక. మరోవైపు కన్నడ, తమిళ సినిమాలతోనూ ఈ టాలెంటెడ్ బ్యూటీ బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నాయికగా నటించే అవకాశం రష్మికను వరించిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే… యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో `నాగేశ్వర రావు` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి నుండి పట్టాలెక్కనున్న ఈ సినిమాలో నాయికగా నటించే అవకాశం దక్కించుకుందట రష్మిక. ఇప్పటికే పరశురామ్ దర్శకత్వంలో `గీత గోవిందం` వంటి సెన్సేషనల్ హిట్ లో సందడి చేసిన రష్మిక… చైతూ కాంబో మూవీతోనూ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి మరి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: