స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్ సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి 8వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“అల .. వైకుంఠపురములో .. ” మూవీ ఘనవిజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటిలో టాలీవుడ్ డైరెక్టర్స్ కు లావిష్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ లో దర్శకులు కె. రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, మారుతి, విక్రమ్ కుమార్, కరుణాకర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి పాటు అప్ కమింగ్ డైరెక్టర్స్ కూడా పాల్గొన్నారు. “అల .. వైకుంఠపురములో .. ” మూవీ సెలబ్రేషన్స్ లో భాగంగా తన ఇంటిలో జరిగిన పార్టీ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని, ఈ పార్టీ ఒక తీపి జ్ఞాపకం గా గుర్తుండిపోతుందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: