యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్న ఈ సినిమా… ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ షెడ్యూల్ లో విజయ్ తదితరులపై కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరించారని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సమర్పణలో పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఇందులో నాయికగా నటించబోతోందని సమాచారం. కాగా, పాన్ – ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వేసవి చివరలో తెరపైకి వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: