నటసింహ బాలకృష్ణ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో తెలుగమ్మాయి అంజలి ఒకరు. నాలుగేళ్ళ క్రితం విడుదలైన `డిక్టేటర్`(2016)లో బాలయ్య, అంజలి జంట మురిపించింది. కట్ చేస్తే… సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఇద్దరూ మరోమారు జట్టుకట్టనున్నారని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. `సింహా`, `లెజెండ్` తరువాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య నటించనున్న ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు స్థానముందట. ఈ నేపథ్యంలో.. ఒక కథానాయికగా అంజలి ఎంపికైందని సమాచారం. త్వరలోనే అంజలి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: