`ఆర్ ఎక్స్ 100` సెన్సేషన్ అజయ్ భూపతి.. స్వల్ప విరామం తరువాత మరోమారు మెగాఫోన్ పడుతున్నాడు. `మహాసముద్రం` పేరుతో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఇప్పటికే శర్వానంద్ ఓ కథానాయకుడిగా ఎంపిక కాగా, మరో హీరో కోసం అన్వేషణ సాగుతోంది. ఇదిలా ఉంటే… ఇందులో కథానాయిక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతతో అజయ్ సంప్రదింపులు జరిపాడని, కథ – పాత్ర నచ్చడంతో సామ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సో.. అన్నీ కుదిరితే `96` తెలుగు రీమేక్ `జాను` తరువాత శర్వానంద్, సమంత కాంబినేషన్ లో రాబోయే సినిమా ఇదే అయ్యే అవకాశముందన్నమాట. త్వరలోనే `మహాసముద్రం`కి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























