సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన స్వరకర్తల్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మదే అగ్రశ్రేణి స్థానం. కథానాయకుడిగా మహేష్ తొలి చిత్రం `రాజకుమారుడు`తో మొదలుకుని… మహేష్ లో నటుడ్ని పరిపూర్ణంగా వెలికి తీసిన `మురారి`, తొలి బ్లాక్ బస్టర్ గా నిలచిన `ఒక్కడు`, `వన్ అండ్ ఓన్లీ` ఇండస్ట్రీ హిట్ అయిన `పోకిరి` వరకు… ఇలా పలు దశల్లో మణిశర్మ సంగీతం ముఖ్య భూమిక పోషించింది. `ఖలేజా` (2010) తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో మళ్ళీ పాటలు సందడి చేయనేలేదు. కాకపోతే, ఆ మధ్య `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013)కి నేపథ్య సంగీతమందించాడు మణి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సుదీర్ఘ విరామం తరువాత ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం… `మహర్షి` అనంతరం మహేష్, వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న మలి చిత్రానికి మణిశర్మనే బాణీలు అందిస్తాడని తెలిసింది. త్వరలోనే ఈ క్రేజీ కాంబో (మహేష్ అండ్ మణిశర్మ) పునఃకలయిక (రీ-యూనియన్) పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయిన మణిశర్మ… ప్రస్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `అసురన్`కి కూడా స్వరాలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: