2019ని `జీరో రిలీజ్ ఇయర్`గా సరిపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ.. 2020లో మాత్రం డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. `అల వైకుంఠపురములో`తో పాటు సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాతోనూ బన్నీ ఈ ఏడాది సందడి చేయనుండగా.. `డిస్కో రాజా`, `క్రాక్` చిత్రాలతో రవితేజ పలకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అటు బన్నీ చిత్రాల్లోనూ, ఇటు రవితేజ సినిమాల్లోనూ తమిళ నటులే ప్రతినాయకులుగా నటిస్తుండడం విశేషం. బన్నీ అప్ కమింగ్ ఫిల్మ్ `అల వైకుంఠపురములో`లో తమిళ నటుడు సముద్రఖని విలన్ గా నటిస్తుండగా.. సుకుమార్ కాంబినేషన్ ఫిల్మ్ లో మరో తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. ఇక రవితేజ అప్ కమింగ్ ఫిల్మ్ `డిస్కోరాజా`తో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహా విలన్ గా నటిస్తుండగా.. `క్రాక్`లో కోలీవుడ్ నటులు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్స్ లో కనిపించనున్నారు.
మరి.. ఒకే బాటలో వెళుతున్న బన్నీ, రవితేజకి.. తమిళ విలన్స్ ఏ మేరకు ప్లస్ అవుతారో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: