ఈ సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే, వాటిలో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నవి మాత్రం మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`, అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` చిత్రాలు అనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ రెండు సినిమాలపైనా… అభిమానుల్లో, సగటు ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటు మహేష్, అటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా లక్కీ డేట్స్ లోనే తమ కొత్త చిత్రాలతో సందడి చేయనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏడేళ్ళ క్రితం `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013) విడుదలైన జనవరి 11నే `సరిలేరు నీకెవ్వరు`తో మహేష్ పలకరిస్తుంటే… 13 ఏళ్ళ క్రితం `దేశముదురు` (2007) రిలీజైన జనవరి 12నే `అల వైకుంఠపురములో`తో బన్నీ సందడి చేయనున్నాడు.
మరి… అచ్చొచ్చిన తేదీల్లోనే వస్తున్న మహేష్, బన్నీ… మరోమారు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసి సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ అందుకుంటారేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: