సంపత్ నంది దర్శకత్వం లో యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది ట్వీట్ తో ధృవీకరిస్తూ ‘నా కోచ్ అండ్ కబడ్డీ టీంతో సాగిన 15 రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ ను అద్భుతమైన విజువల్స్ అండ్ అంశాలతో చిత్రీకరించాము. అవుట్ ఫుట్ విషయంలో చాల సంతోషకరంగా ఉన్నాము’ అని యూనిట్ తో దిగిన గ్రూప్ ఫోటోను పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s a wrap of 15 days of first schedule.
Shot some amazing stuff with my coach n Kabaddi team!
Our happy faces should say it all 😎#Gopichand28 #Tamannaah #SrinivasaaSilverscreen pic.twitter.com/EkcI66B4wR
— Sampath Nandi (@IamSampathNandi) December 29, 2019
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ మహిళా కబడ్డీ కోచ్,తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: