సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సరిలేరు నీకెవ్వరు” మూవీ లో తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ముంబై కు చేరుకున్నారు. ఆదివారం షిర్డీ లో సాయి బాబా ను మహేష్ బాబు దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలలో ఉన్న అభిమానులు మహేష్ బాబు తో ఫొటోలకై ఉత్సాహపడ్డారు. పోలీసులు మహేష్ బాబు కు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహేష్ బాబు షిర్డీ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. జనవరి మొదటి వారంలో “సరిలేరు నీకెవ్వరు ” మూవీ ప్రమోషన్స్ లో మహేష్ బాబు పాల్గొంటారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: