మ‌హేష్ బాబుతో ప‌ర‌శురామ్ నెక్స్ట్ ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్

Mahesh Babu Confirms New Movie With Parasuram

గ‌త ఏడాది సంచ‌ల‌నం `గీత గోవిందం`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్. ఏడాదికి పైగా విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్… త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 వేస‌విలో ప‌ట్టాలెక్క‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ ఫిల్మ్ త‌రువాత‌ `గీత గోవిందం`ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థ‌లోనే ప‌ర‌శురామ్ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. అది సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఉంటుంద‌ని, క‌థ కూడా సిద్ధ‌మైంద‌ని తాజాగా ప‌ర‌శురామ్ ఓ మీడియా సంస్థ‌తో క‌న్ ఫ‌ర్మ్ చేశాడ‌ట‌.

వాస్త‌వానికి, `గీత‌గోవిందం` త‌రువాత మ‌హేష్ బాబుతోనే ప‌ర‌శురామ్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ జాప్యం కావ‌డంతో… చైతూ కాంబినేష‌న్ ఫిల్మ్ ని లాక్ చేశాడు ప‌ర‌శురామ్. ఎట్టకేల‌కు ఇప్పుడు మ‌హేష్ బాబుతోనూ సినిమా క‌న్ ఫ‌ర్మ్ కావ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. త్వ‌ర‌లోనే మ‌హేష్, ప‌ర‌శురామ్ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + six =