గత ఏడాది సంచలనం `గీత గోవిందం`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఏడాదికి పైగా విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్… తన నెక్స్ట్ వెంచర్ ని యువ సామ్రాట్ నాగచైతన్యతో చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 వేసవిలో పట్టాలెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… నాగచైతన్య కాంబినేషన్ ఫిల్మ్ తరువాత `గీత గోవిందం`ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థలోనే పరశురామ్ మరో సినిమా చేయబోతున్నాడు. అది సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని, కథ కూడా సిద్ధమైందని తాజాగా పరశురామ్ ఓ మీడియా సంస్థతో కన్ ఫర్మ్ చేశాడట.
వాస్తవానికి, `గీతగోవిందం` తరువాత మహేష్ బాబుతోనే పరశురామ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ జాప్యం కావడంతో… చైతూ కాంబినేషన్ ఫిల్మ్ ని లాక్ చేశాడు పరశురామ్. ఎట్టకేలకు ఇప్పుడు మహేష్ బాబుతోనూ సినిమా కన్ ఫర్మ్ కావడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే మహేష్, పరశురామ్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: