గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు అజయ్ భూపతి. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా రెండో చిత్రం పట్టాలెక్కలేదు. వాస్తవానికి, `మహాసముద్రం` పేరుతో ఓ మల్టీస్టారర్ ని చేయాలని అజయ్ భావించాడు. అయితే, పలు కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… యంగ్ హీరో శర్వానంద్ తో అజయ్ `మహాసముద్రం` ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని తెలిసింది. అయితే, మరో హీరో ఎవరో అన్నది తేలాల్సి ఉంది. కాగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని, 2020 వేసవిలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు… 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావచ్చని టాక్. త్వరలోనే శర్వానంద్, అజయ్ భూపతి కాంబినేషన్ పై క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: