ఈ ఏడాది కాస్ట్యూమ్ డ్రామా `సైరా నరసింహారెడ్డి` రూపంలో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి… ప్రస్తుతం ఓ సోషల్ డ్రామా చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, `మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్` నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. కోకాపేట్ లో తీర్చిదిద్దిన మాసివ్ హౌస్ సెట్ లో సంక్రాంతి వరకు ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట. సంక్రాంతి సమయంలో స్వల్ప విరామం తీసుకుని… అనంతరం నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారట. ఆపై చకచకా నిర్మాణం జరిపి స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న చిత్రాన్ని జనం ముందుకు తీసుకువస్తారని సమాచారం.
కాగా, త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ మెసెజ్ ఓరియెంటెడ్ మూవీకి `మెలోడీ బ్రహ్మ` మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: