`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్… ప్రస్తుతం `సోలో బ్రతుకే సో బెటర్` అనే హిలేరియస్ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే, `సోలో బ్రతుకే సో బెటర్` తరువాత `ప్రస్థానం` దర్శకుడు దేవ కట్టా కాంబినేషన్ లో ఓ కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడట సాయితేజ్. ప్రముఖ నిర్మాతలు భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం… మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు, ఇందులో పక్కా మాస్ లుక్ లో దర్శనమిస్తాడట తేజ్. కాగా, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























