`హీ ఈజ్ సో క్యూట్… హీ ఈజ్ సో స్వీట్… హీ ఈజ్ సో హ్యాండ్సమ్` అంటూ 2020 సంక్రాంతికి కన్నడ కోమలి రష్మికా మందన్న కొంగొత్తగా సందడి చేయబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ఈ అందాల తార నటించిన `సరిలేరు నీకెవ్వరు`… 2020 ముగ్గుల పండక్కి థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్…. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా… తాజాగా చిత్ర కథానాయిక రష్మిక తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తిచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. మరి… క్యూట్ అండ్ స్వీట్ క్యారెక్టర్ తో అభిమానుల ముందుకు రాబోతున్న ఈ `గీత గోవిందం` భామ… ఈ సారి ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `సరిలేరు నీకెవ్వరు`…. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: