ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు యువ కథానాయకుడు నిఖిల్. ఒక వైపు ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తూనే… మరోవైపు కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. వీటిలో ముందుగా `కార్తికేయ`(2014) చిత్రానికి సంబంధించిన సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది. `కార్తికేయ`ని తెరకెక్కించిన చందు మొండేటి ఈ కొనసాగింపు చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నిఖిల్ కి జోడీగా `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ నటిస్తుందని తెలిసింది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా పెర్ ఫార్మెన్స్ కి కూడా స్కోప్ ఉన్న పాత్ర ఇదని సమాచారం. త్వరలోనే నభా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా… ప్రస్తుతం `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్` చిత్రాలతో పాటు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ నభా నటేష్ నాయికగా నటిస్తోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: