నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేరేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కుస్తీ పోటీలలో పాల్గొనే కథానాయిక హీరో ప్రేమలో పడటం, అతనితో పెళ్లికి ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొనడమే అభ్యంతరం కావడం ఈ ట్రైలర్లో చూపించారు. లవ్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
కాగా ఇంకా ఈ సినిమాలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ పతాకంపై జి. వి. జి. రాజు సమర్పణలో శ్రీరామ్ రాజు, భరత్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గిప్తాన్ ఎలైస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: