తెలుగు,తమిళ్, హిందీ ఇలా పలుభాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది కీర్తి సురేష్. బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్ కు వున్న క్రేజ్ నేపథ్యంలో హిందీ తో పాటు…. తెలుగు, తమిళ్, మలయాళం కూడా రిలీజ్ చేయనున్నారట. ఇక అజయ్ దేవగన్ కూడా సౌత్ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి అది కూడా కలిసొస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. బోనీ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 2020 నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు.
కాగా దీనితోపాటు నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో ఫిమేల్ సెంట్రిక్ మూవీ మిస్ ఇండియా లో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘పెంగ్విన్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు కీర్తి బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తుంది.దీనితో పాటు మలయాళంలో ‘మరక్కార్: ది అరభికడలింటే సింహమ్’ అనే సినిమాలో కూడా నటిస్తుంది. మొత్తానికి ఏడాది కీర్తి సురేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడానికి రెడీ అవుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: