తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలపై ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తునే ఉంటుంది. ఎప్పటిలాగే ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి వినిపిస్తుంది. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ… తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విషయంలో కూడా భాజాపా ఇలానే చేసిందని, కానీ అది సాధ్యంకాలేదని, తాను కూడా వారి ట్రాప్లో పడనని అన్నారు. దీంతో ఇన్నాళ్ళుగా భాజాపాతో రజనీ కలుస్తారనే వార్తలకు చెక్ పడింది. అంతేకాదు అధికారికంగా రాజకీయాల్లోకి వెచ్చే వరకూ సినిమాలు చేస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: