`ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి`… ఇలా రీ-ఎంట్రీలో వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 152వ సినిమాని చేయబోతున్నారు చిరు. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్గా రాబోతున్న ఈ చిత్రం ఇటీవలే పూజ జరుపుకుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఈ నేపథ్యంలో… నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు కొరటాల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఓ నాయికగా సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపికచేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అలాగే బాలీవుడ్ సంగీతదర్శక ద్వయం అజయ్ – అతుల్ బాణీలు అందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… త్రిష, అజయ్ – అతుల్ ఎంపిక దాదాపు లాంఛనమే అని తెలిసింది. త్వరలోనే వీరి ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… `స్టాలిన్` (2006) తరువాత 13 ఏళ్ళ అనంతరం చిరుతో త్రిష మరోసారి నటించబోతుండగా…. `షాక్` (2006) అనంతరం 13 ఏళ్ళ తరువాత తెలుగు సినిమాకి బాణీలు అందించబోతున్నారు అజయ్ – అతుల్. మరి… ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్తో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: