మ‌రోసారి ఇద్ద‌రు నాయిక‌ల‌తో బాల‌కృష్ణ‌?

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని… ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి (‘జయ జానకి నాయక’ ఫేమ్) నిర్మించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… బాలయ్య-బోయపాటి కలయికలో వచ్చిన గత సినిమాల మాదిరిగానే… ఇందులోనూ బాలయ్య ఇద్దరు కథానాయికలతో ఆడిపాడనున్నారని సమాచారం. అందులో ఒక‌రు సీనియ‌ర్ బ్యూటీ కాగా, మ‌రొక‌రు న్యూ టాలెంట్ అని టాక్. త్వరలోనే ఆ ఇద్దరు భామలు ఎవరన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా… బాల‌య్య తాజా చిత్రం `రూల‌ర్‌` రిలీజ్ రోజే అంటే డిసెంబర్ 20న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం. 2020 వేస‌వి చివ‌ర‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్ల‌లోకి రానుంది. మ‌రి… రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌రువాత వ‌స్తున్న బాల‌య్య‌, బోయ‌పాటి… హ్యాట్రిక్ హిట్‌ని న‌మోదు చేసుకుంటారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fifteen =