గతకొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై పూర్తి రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాల్లోకి వస్తున్నట్టు గతకొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పింక్ రీమేక్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవి వార్తలు కాదు నిజమే అని తెలిసిపోయింది. దీనిపై తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పింక్ తమిళ్ లో రీమేక్ చేశారు.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు..పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు తో పాటు బోనీ కపూర్ కూడా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు.
Great news for all the fans & movie lovers 😍😍#PawanKalyan to act in #PINK Telugu remake. #WelcomeBackPSPK🤩 #BoneyKapoor to join hands with star producer #DilRaju for this prestigious project. #VenuSriram is the director!#PSPK #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/ERBU66T48l
— Telugu FilmNagar (@telugufilmnagar) November 2, 2019
అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం పింక్. ఈ మూవీ తమిళంలో నెర్కొండ పార్వాయి అనే టైటిల్తో రూపొందింది. అజిత్ ప్రధాన పాత్రలలో నిర్మితమైన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి చూద్దాం ఈ రీమేక్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: