మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మొన్న దీపావళి పండుగ సందర్భంగా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాపై అప్పుడే పలు రూమర్లు చక్కర్లు కొట్టడం స్టార్ట్ అయ్యాయి. తమిళ్ లో విజయ్, అట్లీ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘తేరి’ సినిమాను ‘పోలీస్ స్టోరీ’ గా రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రూమర్లపై స్పందించిన గోపీచంద్ ఇది తేరి రీమేక్ కాదండీ అంటూ ఈ వార్తను ప్రచురించిన వారికీ రీట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.
ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాపై ఓ క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే..
కాగా ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: