ఉత్తరాదిన.. దక్షిణాదిన కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే. పాత్ర ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ.. మంచి మంచి పాత్రలతో తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఇన్ని రోజులు నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన రాధికా ఆప్టే.. ఇప్పుడు దర్శకురాలిగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుల్షన్ దేవయ్య, షహానా గోస్వామి ప్రధాన పాత్రధారులుగా ‘స్లీప్ వాకర్స్’ అనే ఓ 30 నిమిషాల సినిమాకు దర్శకత్వం వహించారు రాధికా ఆప్టే. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘‘ఏదైనా కొత్తగా రాయాలనే తాపత్రయంలో చిన్నగా ఏదో ప్రయత్నించాను. అనుకోకుండా జరిగిపోయింది.. నేను ఈ స్టోరీ రాసుకున్నప్పుడు.. లలిత, హనీ, అభిషేక్లకు నచ్చడంతో నిర్మిస్తామని చెప్పారు. అలా నేను దర్శకురాలిగా మారడం అకస్మాత్తుగా జరిగిపోయింది. ఈ అనుభవంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది.
లలిత్ శర్మ మాట్లాడుతూ… నిజజీవితంలో జరిగే పతి యాక్షన్ కు రిలేటెడ్ గా ఉంటుంది… కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా.. ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా.. తమని తాము ప్రశించే విధంగా ఉంటుందని తెలిపారు. మరి చూద్దాం రాధికా ఆప్టే చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో..? లేదో..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: