`శ్రీనివాస కళ్యాణం` తరువాత నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `భీష్మ`. సింగిల్ ఫరెవర్ అన్నది ఉపశీర్షిక. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నితిన్కి జోడీగా రష్మిక మందన్న నాయికగా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ నేటి నుండి (అక్టోబర్ 25) రాజమండ్రిలో ప్రారంభం కానుందని సమాచారం. అక్కడ ఓ పాటతో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తారని టాక్. కాగా.. దీపావళి సందర్భంగా ఓ వీడియో సర్ప్రైజ్ ఇవ్వాలని `భీష్మ` యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
ఫిబ్రవరిలో `భీష్మ`ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: