మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… నవంబర్ ద్వితీయార్ధం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఆపై నిరవధికంగా చిత్రీకరణ జరిపి… 2020 ఉగాదికి ఈ సినిమాని విడుదల చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్ – అతుల్ బాణీలు అందిస్తున్నారని టాక్. త్వరలోనే కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి.
మరి… `మిర్చి`, `శ్రీమంతుడు`,`జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`… ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ కొత్త చిత్రంతోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: