‘భలే మంచి రోజు’(2015)తో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు శ్రీరామ్ ఆదిత్య. అనంతరం ‘శమంతకమణి’(2017), ‘దేవదాస్’(2018)తో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ మూడు చిత్రాలు కూడా క్రైమ్, థ్రిల్లింగ్ అండ్ కామెడీ ఎలిమెంట్స్తో రూపొందాయి. కాగా… తన నాలుగో సినిమాని కూడా క్రైమ్ థ్రిల్లర్గానే ఆదిత్య ప్లాన్ చేశాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనుంది. క్రైమ్ బ్యాక్డ్రాప్తో పాటు మదర్ సెంటిమెంట్తో సాగే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కు… శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడని టాక్.
కాగా… గల్లా జయదేవ్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: