మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్ను కేటాయించారని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం… చిరు రూ.50 కోట్లు, దర్శకుడు కొరటాల రూ.20 కోట్ల పారితోషికాన్ని అందుకుంటుండగా… మిగిలిన నటీనటులు, సాంకేతివర్గానికి సంబంధించిన రెమ్యునరేషన్ మరో రూ.10 కోట్లు వరకు ఉంటుందని వినికిడి. ఇక చిత్ర నిర్మాణానికి సంబంధించి మరో రూ.60 కోట్ల వరకు వెచ్చించనున్నట్టు టాక్. మరి… ‘సైరా నరసింహారెడ్డి’ తరువాత మెగాస్టార్ కెరీర్లో సెకండ్ హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా… నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: