బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించుచున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ షూటింగ్ ను చూడటానికి చిరంజీవి సతీమణి సురేఖ కూడా అక్కడికి వెళ్లారట. అయితే అక్కడ సీతారామరాజు విప్లవ వీరుడిగా మారే క్రమంలో ఆయనకి ఎదురైన ఒక సంఘటనను తీస్తున్నారట. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సన్నివేశం చాలా సహజంగా ఉండేలా చూస్తాడు. అలాగే ఈ సీన్ కూడా తాళ్లతో కట్టి కొడుతూ చరణ్ ను ఈడ్చుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ సన్నివేశంలో చెర్రీని చూసి.. రాజమౌళి చిత్రీకరిస్తోన్న విధానం చూసి చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారట. ఇక సురేఖ అయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారట. మరి ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం..
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఎన్టీఆర్ హీరోయిన్ కోసం చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: