ప్రేమకథలకు, అందులోనూ విషాదాంత ప్రేమకథలకు చిరునామాగా నిలిచిన కథానాయకుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. అటువంటి నాగేశ్వరరావు నటించిన తొలి ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’. ఇంకా చెప్పాలంటే… తెలుగునాట ప్రేమకథా చిత్రాలకు నాంది పలికిన సినిమా ఇది. ఏఎన్నార్ మజ్నుగా, భానుమతి రామకృష్ణ లైలాగా దర్శనమిచ్చిన ఈ చారిత్రాత్మక చిత్రంలో… ముక్కామల, సి.ఎస్.ఆర్, కస్తూరి శివరావు, శ్రీరంజని, హేమలత తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. భానుమతి హోమ్ బ్యానర్ భరణి పిక్చర్స్ పతాకంపై ఆమె భర్త పి.ఎస్.రామకృష్ణారావు నిర్మించి, తెరకెక్కించిన ఈ సినిమా… తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ సముద్రాల అందించిన కథ, మాటలు, పాటలు అప్పట్లో జనాదరణ పొందాయి. సి.ఆర్.సుబ్బురామన్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా… “ప్రేమే నేరమౌనా” పాట బాగా ప్రాచుర్యం పొందింది. దీనితో పాటు “విరితావుల లోన”, “పయనమై ప్రియతమ” వంటి గీతాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని… క్లైమాక్స్లో వచ్చే ఇసుక తుఫాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాటోగ్రాఫర్ బి.ఎస్.రంగ అబ్బురపరచే రీతిలో ఈ ఇసుక తుఫానును వెండితెరపై ఆవిష్కరించడం అప్పట్లో ఓ సంచలనం. 1949 అక్టోబర్ 1న విడుదలై మ్యూజికల్ బ్లాక్బస్టర్గా నిలచిన ‘లైలా మజ్ను’… నేటితో 70 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: