లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకి, సెప్టెంబర్ 24కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే… ఇదే రోజున వేర్వేరు సంవత్సరాల్లో ఏయన్నార్ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా… ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించడమే కాకుండా నటుడిగా తనకి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఆ చిత్రాలే… `పల్నాటి యుద్ధం’, `ప్రేమనగర్`, `మేఘసందేశం’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`పల్నాటి యుద్ధం’ విషయానికి వస్తే… ఏయన్నార్ బాలచంద్రుడుగా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాకి గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించారు. 1947 సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఏయన్నార్ కెరీర్ ఆరంభంలో ఓ మెమరబుల్ ఫిల్మ్గా నిలచింది..
ఇక… ఏయన్నార్ కథానాయకుడిగా కె.ఎస్.ప్రకాష్రావు దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ సెన్సేషన్ ‘ప్రేమనగర్’(1971) కూడా ఇదే తేదిన విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలచింది. అంతేకాదు… క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిర్మాత డి. రామానాయుడుకి ఈ చిత్ర విజయం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. శతాధిక చిత్రాల సంస్థగా పేరు తెచ్చుకున్న సురేష్ ప్రొడక్షన్స్ సుదీర్ఘ ప్రస్థానంలో మైలురాయిగా నిలచింది.
అలాగే ఏయన్నార్ కథానాయకుడిగా “దర్శకరత్న” దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘మేఘసందేశం’(1982) కూడా ఇదే సెప్టెంబర్ 24న విడుదలై ప్రజాదరణ పొందింది. ఏయన్నార్ కెరీర్లో 200వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా… పలు `నంది` పురస్కారాలను అందుకుంది.
ఇలా… వేర్వేరు సంవత్సరాల్లో సెప్టెంబర్ 24న వినోదాలు పంచి తెలుగు ప్రజానీకాన్ని విశేషంగా అలరించారు ఏయన్నార్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: