`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే`… ఇలా క్యాచీ టైటిల్స్తోనే వరుస సినిమాలు చేస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్… తన నెక్ట్స్ ప్రాజెక్ట్కి కూడా అదే శైలిని కొనసాగిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన ‘మనీ’ (1993) చిత్రంలోని “భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు” పాట పల్లవిలో వినిపించే `సోలో బ్రతుకే సో బెటర్`అనే పంక్తితో సాయితేజ్ కొత్త సినిమా రాబోతుందని సమాచారం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ఇద్దరు నాయికలకు స్థానముండగా వారిలో ఒకరిగా `ఇస్మార్ట్ శంకర్` ఫేమ్ నభా నటేష్ ఎంపికైనట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… తేజ్ నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం పూర్తైన తరువాతే… `సోలో బ్రతుకే సో బెటర్` సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్. త్వరలోనే టైటిల్, సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: